మరియదాసు కుటుంబానికి బొర్రా ఆర్థిక సహాయం

సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పాళ్ళ మండలం, ముప్పాళ్ళ గ్రామంలో ఇంటింటికి పవనన్న ప్రజాపాట కార్యక్రమంలో భాగంగా ముప్పాళ్ళ గ్రామ జనసైనికుని కుటుంబ పెద్ద గేరపాటి మరియదాసు కొన్ని నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్నారని మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు కు తెలియజేయగా ఇంటింటి పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా మరియదాసుని ఆలాగే వారి కుటుంబాన్ని పరామర్శించి, జనసేన పార్టీ తరపు నుండి ఆర్థికంగా సహాయం చేయడం జరిగినది. జనసేన పార్టీ తమ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్ మండల ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, నకరికల్లు మండల అధ్యక్షురాలు లక్ష్మి, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, షేక్ జాన్ పీరా జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు, భక్తుల కేశవ, వీరమహిళ నామాల పుష్ప, చిలక పూర్ణ, పోటు కన్న, వెంకటేశ్వర్లు, ముక్కంటి, బాషా, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.