ముస్లిం సోదరులకు అల్పాహార విందు ఏర్పాటు చేసిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం పట్టణం ముస్లిం సోదరులందరికీ రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ శనివారం అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పట్టణ ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి.. పవిత్రమైన ముస్లిం ఉపవాస దీక్షకు ఆహ్వానించిన ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. పట్టణ ముస్లిం సోదరులు పోలిశెట్టి చంద్రశేఖర్ ను శాలువాలతో సన్మానించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు బుంగా రాజు, సంపత్, 3 వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాస రావు, ఏరుపల్లి ఎంపీటీసీ సాక్షి శివక్రిష్ణ కుమార్, జిల్లా కార్యక్రమాల సభ్యులు ఆరంకోటి ఆనంద్, నేల శివ, జనసేన నాయకులు తోట రామకృష్ణ, రాంబాబు నాయుడు, కొలగాని సతీష్, పోలిశెట్టి స్వామి, కాళ్ళ ప్రసాద్, రహీమ్ తదితర ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది.