అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పితాని

ముమ్మిడివరం, జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయతీ ఆడవిపేట గ్రామంలో సోమవారం ఆ గ్రామంలో చేపట్టిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల అధ్యక్షులు మోకా బాలప్రసాదు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి అంగాని నరసింహమూర్తి, తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు, సంసానీ పాండురంగారావు, దూడల స్వామి, పిల్లి గోపి, రాగుర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.