దళితులను తడిగుడ్డతో గొంతు కోస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి – ఉన్నమట్ల ప్రేమ్ కుమార్

ఇప్పటివరకు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఈవిధంగా దళితులను మోషం చేయలేదని అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సి ఎస్టీల సంక్షేమం కోసం రూపాయి ఖర్చుపెట్టకపోగా ఎస్సి నిధులను తన సొంతపధకాలకు మల్లించుకోవడం తడిగుడ్డతో గొంతుకోయడమే అవుతుందని. అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టడానికి వంకలు వెతికినప్పుడు చాలామందికి అర్ధం అయ్యిందని మేము ప్రశ్నలు అడుగుతుంటే పక్కదారి పట్టించడమో లేక వాగ్వాదాం పెట్టుకోవడమో చేస్తున్నారు తప్ప సమాధానం చెప్పే పరిస్థితి లో ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు. ఇంటింటికి వస్తున్నపుడు బాధితులుగా మారిన ఓటర్లు అడిగే ప్రశ్నలకు వై.కా.పా నాయకులు నీళ్లు నములుతున్నారని, కనీసం ఉన్న మిగిలిన పదవీకాలం అయినా ఎస్సి ఎస్టీల సంక్షేమంపై దృష్టి పెట్టకపోతే ఓట్లు వేసిన వారే బూట్లతో తరుముతారని జనసేన జిల్లా నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ హెచ్చరించారు.