సుదర్శన హోమం నిర్వహించిన చిర్రి బాలరాజు దంపతులు

పోలవరం, వైయస్ జగన్నాధపురంలో లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో స్వాతి నక్షత్ర లగ్నమందు ప్రజల సుఖశాంతులతో ఉండాలని, రైతులు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని, యువత చదువు ఉద్యోగాలతో భవిష్యత్తులో పైకి ఎదగాలని, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు స్వామి వారి అండదండలు ఎప్పుడూ ఉండాలని, నేడు పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిర్రి బాలరాజు దంపతులు సుదర్శన హోమం చేయడం జరిగింది. ఈ హోమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిర్రి కృష్ణయ్య, సింగలూరి కృష్ణమూర్తి, తొమ్మిదేళ్ల వెంకటరత్నం, పసుపులేటి మోహన్ రావు పాల్గొన్నారు.