‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చిన దారం అనిత

మదనపల్లి, దేశంలోనే జీరో బడ్జెట్ రాజకీయాలకు నాంది పలుకుతూ మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, సామాన్యులను రాజకీయాలలో చేరేవిధంగా, ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే జనసేన పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం ప్రజలనుంచి విరాళాలు సేకరించి వారిని పార్టీలో భాగస్వాములను చేసేవిధంగా, అలాగే పార్టీకి అండగా నిలబడాలని, పార్టీకి తమ శక్తి మేరకు విరాళాలు అందిస్తూ ‘నా సేన కోసం నా వంతు’ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొనిపోవడం అందరి భాధ్యత అని పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు తమ వంతు సాయం చెస్తూ మరికొంత మందిని పార్టీకి అనుసంధానం చేయవల్సిందిగా కోరుతున్నానని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిత దారం అన్నారు.