9వ రోజు జనంతో జనసేన

ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో, జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 9వ రోజు కొండపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని, తొందర్లోనే ఆ సమస్యలన్నిటిపై జనసేన తరుపున పోరాటం చేసి, వీలైనంత తొందరగా పరిష్కారం చేస్తామని భరోసా కల్పించడం జరిగింది. ఇలాంటి సమస్యలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని ఆదరించి, ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా మనవి చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట శ్రీను, సెపెన రమేష్, కిళ్ళన నరేష్, డుబా సంగం నాయుడు, ప్రసాద్, మోహన్, రుద్రదీప్, సంతోష్ నాయుడు, అనిల్, కోమలరావు, జనసేన కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.