రంపచోడవరంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

రంపచోడవరం: రాష్ట్ర జనసేన పార్టీ తెలుగు దేశం పార్టీల ఉమ్మడి ప్రణాళికలో భాగంగా మన దేవిపట్నంలో అధ్వానంగా ఉన్న గోతులు గొప్పులు రోడ్డు కమలంపాలెం నుండి కోరుకొండ వెళ్లే రోడ్డు సుమారు 8 గ్రామాలు రవాణా రోడ్డు పరిస్థితి ఇలా ఉందని డిజిటల్ క్యాంపెన్ ద్వారా చారపు వెంకటరాయుడు ఆధ్వర్యంలో క్యాంపైనింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ కర్రీమహేష్ ఎస్టీ సెల అధ్యక్షుడు శ్రీను వాసుదొర సీనియర్ నాయకులు మట్టా సందీప్, కొమరం దొరబాబు, శివ, పవన్, రాజు, ప్రసాద్, సాయి, రాముడు, శ్రీను, ఉదయ్ కిరణ్ మొదలైనవారు పాల్గొన్నారు.