గూడూరు జనసేన ఆధ్వర్యంలో వాలంటీర్స్ కు ఘన సన్మానం..

గూడూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి సారధ్యంలో గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో ఎక్కువ క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన కార్యకర్తలు పారిచెర్ల భాస్కర్, ఎస్ కే జమాల్ భాషా, ఇంగిలాల కార్తిక్, కొండేటి వెంకటేశ్వర్లు, యనమల విజయ్, కొలిపడియర్ మోహన్ లను శాలువలతో సత్కరించి.. పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసిన ప్రశంసా పత్రం అందచేయటం జరిగింది. శనివారం క్రియాశీలక సబ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ కిట్లు అందచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, ఇంద్రవర్ధన్, శశి, ధనుంజయ, వసంత్ తదితరులు పాల్గొన్నారు.