కాకినాడ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: జగనన్నా మా స్థలాలు ఎక్కడ..? అని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆదివారం చేపట్టిన పిఠాపురం మున్సిపాలిటీ పరిధి మరియు పిఠాపురం మండలం పలు గ్రామాలకు సంబంధించి సుమారు 5000 మంది లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు నేటికీ చూపించలేదని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపాలిటీ మరియు పిఠాపురం మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కేటాయించామని చెబుతున్న పిఠాపురం పట్టణానికి సమీపమున విరవాడ రోడ్డులో గల లేఅవుట్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే అప్పగించాలని డిమాండ్ తో.. జగనన్న కేటాయించిన ఇళ్ల స్థలాల మధ్యలో బేటాయించి ధర్నా చేసిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ సోమవారం జిల్లా కలెక్టరెట్లో కలెక్టర్ కు వినతి పత్రం అందించడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం మున్సిపాలిటీ పరిధి మరియు పిఠాపురం మండలంలో పలు గ్రామాలకు సంబంధించి సుమారు 5000 మంది లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు నేటికీ చూపించలేదని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే అప్పగించాలని, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందచేసినట్లు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకర నాయకులు కంబాల దాసు, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, వెన్నపు చక్రధర్ రావు, బొజ్జ గోపికృష్ణ, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, పల్నాటి మధుబాబు, బండి అప్పారావు, గేదెల వెంకటరావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.