దేవాదాయ చట్టం నుంచి ఆర్యవైశ్య సత్రాలకు మినహాయింపు..

ఎపి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు, వాసవీ కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక, నుంచి ఆర్యవైశ్య సంఘాల పరిధిలోనే ఇవి పనిచేస్తాయని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ తెలిపారు. ఇటీవల ఆర్యవైశ్య సంఘాలు సిఎం జగన్‌ను కలిసి దీనిపై వినతి పత్రం అందించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.