Razole: నాల్గవ రోజు సభ్యత్వ నమోదు కిట్లను అందజేసిన రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు

పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం ములికిపల్లి గ్రామంలో రాజోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు( వైస్ ఎంపీపీ) ఇంటిపల్లి ఆనందరాజు నుండి జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేరిన కార్యకర్తలకు నాల్గవ రోజు సభ్యత్వ నమోదు కిట్లను పంపిణి చేశారు. ఈ యొక్క కిట్ లో సభ్యత్వ నమోదు కార్డుతో పాటు, 5 లక్షల ప్రమాద భీమా పత్రం, పార్టీ యొక్క 7 సిద్ధాంతాలతో కూడిన పవన్ కళ్యాణ్ ఫొటో, అధ్యక్షుల వారి మనోగతం యొక్క వివరాలు, ఒక నోట్ బుక్ అందించారు. రాజోలు నియోజకవర్గం ములికిపల్లి గ్రామంలో రాజోలు మండలం పరిషత్ ఉపాధ్యక్షుడు ( వైస్ MPP) ఇంటి పల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో జనసేన MPTC శ్రీమతి పున్నం నాగ దుర్గ చేతులమీదుగా సభ్యత్వం కిట్లు, ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పొన్నం శ్రీనివాసరావు, కొడవటి శివకుమార్, అడబాల ముత్యాలనాయుడు, గణేష్, రామకృష్ణ, పణి, కొడవటి ప్రశాంతి, అడబాల వెంకన్న, గిడుగు ప్రసాద్, లంకలపల్లి దుర్గారావు, వేరు బండి విజయ్ కుమార్, శంకర్ కరుణాకర్, సురేష్, రవిచంద్ర, దొరబాబు పాల్గొన్నారు.