అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి మనోధైర్యాన్నిచ్చిన గర్భాన

పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన మోయ్యి బాలకృష్ణకు గత కొద్దిరోజుల నుండి అనారోగ్యం కారణంగా రోజు రోజుకి ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండటంతో సహాయం కోసం పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబుకి విషయం తెలియ చేయడంతో వెంటనే గ్రామానికి చేరుకొని పేషెంట్ యొక్క యోగ క్షేమాలను తెలుసుకొని చికిత్స చేసిన డాక్టర్ కి ఫోన్ చేసి పెషేంట్ ఆరోగ్య సమస్యను తెలుసుకొని బ్లడ్ అవసరమని చెప్పగానే వెంటనే బ్లడ్ ఇప్పించి, మందులు ఖర్చు నిమిత్తం కొంత ఆర్థిక సహాయం చేస్తూ, అలాగే ఆయనకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.