జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల వెంకటలక్ష్మి నియామకం

మంగళగిరి: జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని రాష్ట్ర కేంద్రం కార్యాలయంలో ఆమెకు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని అందుకున్న వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపైన పోరాడుతూ తద్వారా జనసేన పార్టీ బలోపేతానికి నేను చేస్తున్న కృషిని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఈ పదవిని ఇవ్వడం జరిగిందని, ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడుతూ ఇప్ప్పుడున్న ఈ రాక్షస పాలన అంతం చేయడమే లక్ష్యంగా మనం అందరం కష్టపడి కలిసి పనిచేయాలని, రాబోయేది మన ఎన్.డి.ఏ ప్రభుత్వమేనని మీరు ఇప్పటివరకూ పడిన కష్టానికి ఫలితంగా మన ప్రభుత్వం రాగానే మీకు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి కేబినేట్ హోదాతో సమానమైన పదవి మీకు ఇస్తానని హామీ ఇచ్చారని, దీనికినేను పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.