గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 8వ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 8వ రోజు ములలంక పంచాయతీ గిరిజన గ్రామంలో పర్యటించిన వీరఘట్టం జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమలో భాగంగా జనసేన సిద్ధాంతాలను, మ్యానిఫెస్టోలోని అంశాలను గ్రామ పెద్దలకు వివరించారు, జగన్ పాలనలో ప్రజలు పడుతున్న అవస్థలు జనసైనికులకు వారు తెలిపారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు చేస్తున్న సహాయ కార్యక్రమాల వివరాలను మత్స పుండరీకం గ్రామ పెద్దలకు వివరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జనసేన జానీ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చేపడుతున్న రైతు భరోసాయాత్ర, ప్రజావాణి, రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లపై పోరాటం, కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆర్థికంగా అందిస్తున్న మొదలగు సహాయ చర్యలు ప్రజలకు తెలియజేయాలని దృఢనిచ్చాయంతో పనిచేస్తున్నామని తెలిపారు. సొండి సుమన్ మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలతీరు వర్ణనాతీతం ప్రజల్లోకి చాలా బలంగా తెలపాలనే ఉద్దేశ్యంతో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమాన్ని చేపట్టామని, ముఖ్యమంత్రి బటన్ నొక్కడమే తప్ప ప్రజలకు మేలు జరగట్లేదని ద్వజమెత్తారు. బొమ్మాళి వినోద్ మాట్లాడుతూ మీరు అందరు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ సొండి అమల, క్రియాశీలక సభ్యులు కర్ణేన సాయి పవన్, దూసి ప్రణీత్, జరజాపు రాజు, వావిలపల్లి నాగభూషన్, తదితరులు పాల్గొన్నారు.