Vizag: ప్రభుత్వం పక్కా ఇళ్ళు కట్టించి ఇవ్వాలి: గుమ్మడి శ్రీరామ్

విశాఖపట్నం జిల్లా, దేవరపల్లి మండలం వాకపల్లి గ్రామంలో 20 సంవత్సరాలుగా ఏడు కుటుంబాల ప్రజలు నివసిస్తున్నారు వారికి ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. వారిని ఏ అధికారి కూడా పట్టించుకోలేదు నాయకులు వారి చేత ఓట్లు వేయించుకొని వారికి పక్కా ఇళ్లు కట్టించడం లేదు. జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పేరు మీదగా 50 కేజీలు బియ్యం ఇచ్చి తమకు తోచిన సహాయం అందించడం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని పక్కా ఇల్లులు కట్టించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నామని మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్ అన్నారు.