విజయవంతంగా కొనసాగుతున్న ఇమ్మడి కాశీనాధ్ పాదయాత్ర

మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ తలపెట్టిన పాదయాత్ర ఐదవ రోజు చినమనగుండం నుండి బయలుదేరి తాడివారిపల్లి, ఉమ్మారెడ్డిపల్లి, నాగెళ్ళముడుపు, మీర్జాపేట, కారుమానుపల్లి మరియు తర్లుపాడు గ్రామాల వరకు చేరుకోవడం జరిగింది. అనంతరం తర్లుపాడు గ్రామం నందు జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండాను ఇమ్మడి కాశీనాధ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.