Ind vs Eng 1st T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. మూడు వికెట్లు కోల్పోయిన భారత్..
టీమిండియాతో జరగనున్న ఐదు టీ20 సిరీస్లో భాగంగా అహ్మదబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇదిలా ఉంటే టెస్ట్ మ్యాచ్లో కోలుకోని దెబ్బకొట్టిన భారత్ను ఓడించాలని ఇంగ్లాండ్ కసితో ఉంది. అలాగే టెస్ట్లాగే టీ20లోనూ విజయపరంపరంగా కొనసాగించాలని భారత్ చూస్తోంది.
ఇదిలా ఉంటే మ్యాచ్ ప్రారంభమయ్యే చివరి క్షణంలో రోహిత్ శర్మకు విరామం ప్రకటించారు. దీంతో చివరి క్షణంలో రోహిత్కు ఎందుకు విశ్రాంతి ఇచ్చారనే అనుమానం వస్తోంది. రోహిత్కు ఏమైనా గాయమయ్యిందా అనే కోణంలో కూడా విశ్లేషిస్తున్నారు. అయితే టాస్ తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. కొన్ని మ్యాచ్లకు రోహిత్కు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే ఐసిసి ర్యాంకింగ్స్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ప్రస్తుతం మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. కొంతకాలంగా ఇంగ్లాండ్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, భారత జట్టు ఇటీవల రెండో స్థానికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు ఈ సిరీస్ మొదటి స్థానంలోకి వెళ్లడానికి ఒక అవకాశంగా చెప్పవచ్చు. అయితే టీమిండియా ఈ సిరీస్ను 4-1 లేదా 4-0తో గెలిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
తుది జట్లు:
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, శ్రేయస్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలన్, బెయిర్స్టో, స్టోక్స్, సామ్ కరన్, జొర్డాన్, ఆర్చర్, మార్క్వుడ్, రషీద్.