పులిగడ్డ గ్రామంలో దిగ్విజయంగా కొనసాగుతున్న జనంలోకి జనసేన

  • జనంలోకి జనసేన 3వ రోజు

అవనిగడ్డ నియోజకవర్గం: పులిగడ్డ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా గుడివాక శేషుబాబు మాట్లాడుతూ వైసీపీ అసమర్థ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.. గత, ప్రస్తుత అసమర్థ పాలకులు మా గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాన్ని ఏర్పాటు చెయ్యలేకపోయారు ఈసారి మా ఓటు జనసేన పార్టీకి వేస్తాం అని ప్రజలు సృష్టం చేశారు.. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని గ్రామ ప్రజలందరూ కృత నిశ్చయంతో ఉన్నారు. ముఖ్యంగా ఇంటి ఇంటికి తిరుగుతున్న సమయంలో మహిళలు చెప్పిన మాట డబ్బులో నుండి కాదు ప్రజల్లో నుండి పుట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ, ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కృత నిశ్చయంతో గ్రామస్తులు, మహిళలు ఉన్నారని శేషుబాబు పేర్కొన్నారు.