సబ్ కలెక్టర్ కార్తీక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

అనంతపురం జిల్లా, పెనుగొండ రెవిన్యూ సబ్ డివిజన్ కు నూతన బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్ కార్తీక్ ఐఏఎస్ ని పుష్ప గుచ్చం ఇచ్చి దుశ్శాలువాతో సన్మానించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగొండ నగర జనసేన పార్టీ అధ్యక్షులు పెనుగొండ లోకేష్, వీర మహిళలు శ్రీదేవి, సుబ్బమ్మక్క, పెనుగొండ నాయకులు రమేష్ పూల నరేంద్ర, రమేష్, బాబా ఫక్రుద్దీన్, మూర్తి(సోమందపల్లి), ఆకుల రమేష్, పి.సి.జగదీష్, సి.లోకేష్, హర్ష తదితరులు పాల్గొన్నారు.