జనసేన క్రియాశీల కార్యకర్త, కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

*”15,000/- వేల రూపాయల” ఆర్థిక సహాయంతో పాటు “క్వింటా యాభై కిలోల బియ్యం” అందచేత

వరంగల్, నర్సంపేట పట్టణంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న జనసేన కార్యకర్త “నైనబోయిన శేషు కుమార్” యొక్క భార్య “రమ్య” ఇటీవల మరణించడంతో పశ్చాత్తాపం చెంది “జనసేన పార్టీ వరంగల్ జిల్లా నాయకులు గొల్ల రాజేంద్ర ప్రసాద్ మరియు నర్సంపేట నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్ లు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి నియోజకవర్గ జనసేన తరుపున “15 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు” క్వింటా యాభై కిలోల బియ్యాన్ని” అందజేశారు. ఈ సందర్భంగా జన సేన కార్యకర్త శేషుకుమార్ కి” ఇద్దరు ఆడ పిల్లలు” ఉండడంతో వారికి భవిష్యత్తులో ఏ ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గడ్డం రాకేష్, సురేష్, అభిలాష్, నియోజకవర్గ జనసేన కార్యవర్గ సభ్యులు వంగ మధు, ఒర్సు రాజేందర్, యాకూబ్, రంజిత్, డేవిడ్, రమేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.