శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, పుల్లలచెరువు గ్రామంనందు శ్రీరామనవమి పండుగ పర్వదినాన శ్రీశ్రీశ్రీ చౌటపల్లి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వార్షిక తిరుణాళ్ళ సందర్భంగా పుల్లలచెరువు గ్రామ జనసైనికులు ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్రభ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు షేక్ రియాజ్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, గ్రామ ప్రజలు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.