ముకుంద నాయుడును పరామర్శించిన జనసేన నాయకులు

వనపర్తి: జనవరి 24వ తేదీన వారాహి ప్రత్యేక పూజల కోసం పవన్ కళ్యాణ్ కొండగట్టు యాత్రకు వనపర్తి జిల్లా కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు బయలుదేరి వస్తున్నసమయంలో ప్రమాదవశాత్తు ఆయన వాహనం ఆక్సిడెంట్ కు గురై ముకుంద నాయుడు కు తీవ్ర గాయాలైనాయి. ఈ సందర్భంగా జనసేన వనపర్తి జిల్లా నాయకులు ఏమి రెడ్డి రాకేష్ రెడ్డి, ఏదుల శరత్ గౌడ్, మరియు రవి ముకుంద నాయుడు నివాసంలో ఆయనను పరామర్శించి, వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.