శాకాంబరీ అలంకారంలో శ్రీకన్యకాపరమేశ్వరిని దర్శించుకున్న జనసేన నాయకులు

గుంటూరు నగరంలోని ఏటుకూరు రోడ్డు అర్. అగ్రహారం నందు గల శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానము నందు అమ్మవారికి శాఖాంబరి అలంకారం సందర్భంగా దేవస్థానం పాలక మండలి సభ్యుల ఆహ్వానం మేరకు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించి, తదుపరి కమిటీ సభ్యులు సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నిడమానూరి సురేష్, సభ్యులు కనమర్లపూడి మారుతి శివ వెంకట సుబ్బారావు, డి.ఎన్.డి.ఎల్ సురేష్, బైసాని ఇందువతి, కొలిశెట్టి రమాదేవి, ఇతర పాలక మండలి సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, గుంటూరు నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, భక్తులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.