జనసేనాని నాయకత్వం అవసరం

  • పెదరావుపల్లి, చినరావుపల్లిలో జనంకోసం జనసేన
  • ప్రజల నుంచి విశేష స్పందన

అశాంతి, అవినీతి పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో నీతివంతమైన రాజకీయాలకు తెరతీసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నాయకత్వం రాష్ట్రానికి అవసరమని జనసేన పార్టీ ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్యనారాయణ పేర్కొన్నారు. నాయకులు గొరపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో కొత్తవలస మండలం పెదరావుపల్లి, చినరావుపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి జనంకోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకూ వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధికారంలోకి వచ్చాక అమలుచేయబోయే షణ్ముఖ వ్యూహం గురించి ప్రచారం చేశారు. వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన షణ్ముఖ వ్యూహంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ప్రజలు స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. ఇటువంటి గొప్ప ఆలోచనలు ఉన్న పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలంతా బలపరచాలని కోరారు. పార్టీ నాయకులు గొరపల్లి రవికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి ఈ స్పందనే నిదర్శనమని పేర్కొన్నారు. నాయకులు వబ్బిన సన్యాసినాయుడు మాట్లాడుతూ భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణ గురించి ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తూరిబిల్లి విజయ్ కుమార్, మల్లువలస శ్రీను, నక్కరాజు సతీష్, రుద్ర నాయుడు, రామ కాశీ, మదిన రాజేష్, చందక హర్ష, మదిన రమేష్, టి.దేవీ ప్రసాద్, జి. గౌరీ నాయుడు, ఏడువాక రాజు, గొరపల్లి వెంకటరావు, పెంటకోట శ్రీను, ముచ్చ శ్రీను, ఇరోతి రమణ పాల్గొన్నారు.