బొబ్బిలంక గ్రామంలో జనంకోసం జనసేన మహా పాదయాత్ర

  • జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి బ్రహ్మరథం పట్టిన బొబ్బిలంక గ్రామ ప్రజలు

రాజానగరం, 109 వ రోజు “జనం కోసం జనసేన మహా పాదయాత్ర”లో భాగంగా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీచైన్లను పంచుతూ రాబోయే 2024 ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు పై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసి మన భావితరాలకు మంచి భవిష్యత్తును ఇద్దామని ఈ సందర్భంగా బత్తుల తెలియజేయడం జరిగింది. ఈ పాదయాత్రలో వీరు వెంట జనసేన నాయకులు జనసైనికులు గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.