వి.ఆర్.ఏ లకు జనసేన పార్టీ నాయకుల మద్దతు

పుట్టపర్తి, రాష్ట్ర వ్యాప్తంగా వి.ఆర్.ఏ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా శనివారం పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్ధుల్ అబు మాట్లాడుతూ మండలంలోని ప్రతి పంచాయితీలకు, గ్రామాలకు తిరుగుతూ పని చేసే వారు వి.ఆర్.ఏ లు. ఇప్పుడు ఉన్న నిత్యవసరాల సరుకుల ధరలను చుస్తే ప్రభుత్వం ఇచ్చే జీతాలకంటె ఎక్కువగ ఉన్నాయి. వారు గ్రామాలలో తిరగాలంటె ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కొనాలంటె ఇబ్బంది పడుతున్నారు. 2018 జులై నుండి 2022 జనవరి వరుకు వారికి చెల్లించిన టిఏ, డిఏ సొమ్మును సైతం వాపస్ తీసుకోవడం అత్యంత దారుణం. ఇలాంటి వికృత చేష్టల జిఓ లను రద్దు చేసి వారికి 21000/- రూపాలను జీతం చెల్లించాలని జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వి.ఆర్.ఏ లు హైదర్ వలి, డి నరసింహులు, మురళి, శ్రీనివాసులు, నారాయణమ్మ, నాగప్ప రామాంజనేయులను కలిసిన మరియు జనసేన నాయకులు తిరుపతేంద్ర, నల్లమాడ మండల కన్వినర్ మహేష్, సాయిప్రభ, బోయ వంశీ, రమేష్, మేకల పవన్ తదితరులు పాల్గొన్నారు.