జనసేన ఆత్మీయ సమావేశం

తుని, కొత్త పెరుమాళ్ళపురం గ్రామ పంచాయతీ సంబంధించిన జనసేన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ముఖ్యమైన జనసైనికులతో కలిసి హుకుంపేట బీచ్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా జనసేన పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి, తొండంగి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు బెండపూడి నాయుడు, జిల్లా నాయకులు వంగలపూడి నాగేంద్ర మరియు పలివెలలోవరాజు, రాష్ట్ర మత్స్యకార నాయకులు చొక్కా కాశీ పనితీరు, వారు ఏ విధంగా పనిచేస్తున్నారు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీ ఏ విధంగా ప్రజలకు అండగా ఉంటుందో ఆత్మీయ సమావేశానికి హాజరు అయిన జనసైనికులకు వివరణ ఇస్తూనే కొత్త పెరుమాళ్ళపురం గ్రామ పంచాయతీ సంబంధించి జనసేన కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పడం, ఎవరెవరు ఉండాలో ఆయా గ్రామాల ప్రజలతో మమేకమైన కొంతమంది ముఖ్యమైన నాయకులు పేర్లు ఇవ్వాలి అని కోరడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో మరింత కమిటీ ఏర్పాటు అయ్యాక బహిరంగ సభ ఏర్పాటు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అని ఆలోచించడం జరిగింది. ఈ సమావేశానికి తొండంగి మండలం జనసేన అధికార ప్రతినిధి గరికిన రాజాబాబు, తొండంగి మండలం జనసేన కార్యదర్శి కొయ్య వెంకట శ్రీధర్, తొండంగి మండలం జనసేన సంయుక్త కార్యదర్శి చొక్కా అంజి రామ్, కొత్త చోడిపల్లిపేట, హుకుంపేట, అవల్ధారపాడు, పాత పెరుమాళ్ళపురం, గడ్డపేట తదితర గ్రామాల జనసైనికులు హాజరు కావడం జరిగింది.