జనసేన టిఫిన్ విత్ సఫాయి

హైదరాబాద్, మే డే సందర్భముగా కె.పి.హెచ్.బి కాలనీ 114 డివిజన్ అధ్యక్షులు కొల్లా శంకర్ జనసైనికులతో కలసి టిఫిన్ విత్ సఫాయి కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలో గల జిహెచ్ఎంసి సఫాయి కార్మికులతో కలసి జనసైనికులు టిఫిన్ తీసుకున్నారు. ఈ సందర్భముగా కొల్లా శంకర్ మాట్లాడుతూ నిత్యం మన పరిసరాలను శుభ్రం చేస్తూ మనల్ని మంచి వాతావరణంలో ఉంచే ఈ సఫాయి కార్మికుల సేవలను మరువలేమని వారు చేసే ఈ సేవతోనే మనమందరము ఆరోగ్యంగా ఉంటున్నామని, కార్మికులకు అండగా మా అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ఇరు రాష్ట్రాల్లో ప్రజలతో మమేకమవుతూ ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమములో బాలాజీ నగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు తుమ్మల మోహన్ కుమార్, కె.పి.హెచ్.బి 114 డివిజన్ వైస్ ప్రెసిడెంట్ చరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి(కేబుల్) శ్రీనివాస్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.