కరగాణపేట గ్రామంలో పర్యటించిన కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలంలో.. పెంట పంచాయతీ కరగాణపేట గ్రామంలో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు కాంతిశ్రీ పర్యటించారు.. పర్యటనలో భాగంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులు ఇటీవలే ప్రమాదంలో గాయాలపైన దుక్క రాజారావు ని పరామర్శించి.. అలాగే ఆ గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామ ప్రజలు త్రాగునీరు సమస్య అధికంగా ఉందని.. గ్రామంలో వీధులు లైట్లు లేక అంధకారంలో ఉంటున్నాం అని, ఇంకా రోడ్డు కాలువలు పరిస్థితి పూర్తిగా లేవని వారు ఆవేదన వ్యక్తంచేశారు. జనసేన పార్టీ తరుపున వారి సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పూర్తిగా పరిష్కరించే విధంగా కృషి చేస్తాం అని కాంతిశ్రీ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు దుర్గారెడ్డి, దుర్గారావు, సూర్యనారాయణ, సత్య రవిబాబు, శివ, అనంత, వాసు, సురేష్, బురా నర్సింగరావు, కె. రమణ, సూర్యనారాయణ, పొలిరాజు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.