సచివాలయ నమూనాను ఆమోదించిన కేసిఆర్ కేబినెట్

సచివాలయం నూతన భవన సముదాయం నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తూర్పు అభిముఖంగా ఏడు అంతస్తుల్లో కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లకు ఆమోద ముద్ర వేసింది. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్, పొన్ని ఈ భవన నమూనాలను రూపొందించారు.