Srikakulam: జనసేనపార్టీ ఆధ్వర్యంలో శ్రీ కోడి రామమూర్తి నాయుడు జయంతి

స్వర్గీయ శ్రీ కోడి రామమూర్తి నాయుడు జయంతిని జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ కోడి రామమూర్తి నాయుడు మనుమడు శ్రీ కోడి వెంకటరావు నాయుడు, జనసేనపార్టీ నాయకుడు మత్సపుండరీకం పువ్వుల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మత్సపుండరీకం మాట్లాడుతూ స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్ళు గడిచినా ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం దురదృష్టమని, నాడు తెల్లదొరల పాలనలో సైతం భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన వక్తి శ్రీ కోడి రామమూర్తి నాయుడు అని అన్నారు. కోడి వెంకటరావు నాయుడు మాట్లాడుతూ ప్రపంచ చరిత్ర ఉన్న వక్తికి నేడు చరిత్ర లేకుండా ఉంది. దీనిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా శ్రీ కోడి రామమూర్తి నాయుడుని గుర్తించాలని కోరారు.