కొమ్మోజు సుబ్రహ్మణ్యం కుమారుడిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తాళ్ళరేవు మండలం చొల్లంగి పేట గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడిన కొమ్మోజు సుబ్రహ్మణ్యం కుమారుడిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తాళ్ళరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, జి వేమవరం సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, తాళ్లూరి ప్రసాద్, చల్లంగి పేట గ్రామ కన్వీనర్ రేలంగి శ్రీనివాసరావు, కుంది దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.