నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన కురుపాం జనసేన

మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, అప్పన్నదొరవలస గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం నుంచి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అనారోగ్యంతో బాధ పడుతుంది. ఆ విషయం తెలుసుకున్న జనసేన కురుపాం నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు ఆ మహిళకు హాస్పటల్ ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరుపున ఆ కుటుంబానికి 4000/- రూపాయలు ఆర్ధిక సహాయం చేసి.. జనసైనికుల తరుపున మీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలబడి ఉంటుంది అని.. ఆ కుటుంబానికి జనసేన నాయకులు నేరడ బిల్లి వంశీ, వాన ఉపేంద్ర, గార గౌరీశంకర్ భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనంత్, రాజేష్, రజింత్, సంజు, శివాజీ, చిరంజీవి, రాంబాబు, గణేష్, భార్గవ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.