పేరాపురం పంచాయతీలో లోకం మాధవి పర్యటన

నెల్లిమర్ల నియోజకవర్గం: పూసపాటిరేగ మండలంలోని పేరాపురం పంచాయతీలో, మన ఊరిలో జనవాణీ కార్యక్రమంలో భాగంగా లోకం మాధవి ప్రతిగడపకి పర్యటించి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. వాటిలో ముఖ్యంగా నాలుగు ఏళ్లు గడుస్తున్నా ఇంటి బిల్లులు కానీ పెన్షన్ లు కానీ మంజూరు అవ్వకపోవడం, అలాగే గొల్లపేటలో సరైనటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ లేకపోవడం వంటి సమస్యలు గ్రామస్తులు మాధవి గారి దృష్టికి తీసుకొని వచ్చారు. సమస్యలు విన్న మాధవి గొల్లపేట గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందని, ఊరి బయట రోడ్లు కానీ, ఊరి లోపల రోడ్లు లేవు అని, ప్రజలు నిరాధరణకి గురవుతున్నారని తెలిపారు. అలాగే ఆ సమస్యలపై వినతిపత్రం సంబంధిత అధికారులకు ఇచ్చి బాధితులకి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. అలాగే జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసుని మరియు అధినేత పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండల అధ్యక్షులు జలపారి శివ దొర, రాష్ట్ర మత్సకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, సీనియర్ నేతలు బూర్లె, విజయశంకర్, బూర సతీష్, కొలిచిన రమేష్, మాదేటి ఈశ్వరావు, జానకీరామ్, బావిశెట్టి నారాయణరావు, లెంక సురేష్, పిన్ని తదితరులు పాల్గొన్నారు.