ఇప్పటం గ్రామ ప్రజలకు.. పోలీసులకు.. మీడియాకు కృతజ్ఞతలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకు తమ పొలాలను ఇచ్చి అండగా నిలిచిన ఇప్పటం గ్రామ రైతులకు, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలిపే విధంగా ధైర్యంతో మా పార్టీ కార్యక్రమ నిర్వహణకు మా వెన్నంటి ఉన్నారు. ఈ సభ సజావుగా సాగడానికి సహకరించిన పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను. ఆవిర్భావ సభ కార్యక్రమాల గురించి ముందు నుంచి ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతోపాటు సభను లైవ్ కవరేజీ ఇచ్చిన మీడియా ప్రతినిధులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. ఈ కార్యక్రమ నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించిన జనసేన నాయకులకు, శ్రేణులకు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 12 కమిటీల్లోని సభ్యులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.