వచ్చేది మా ప్రభుత్వమే..! ఐజీకి బండి సంజయ్‌ వార్నింగ్..

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో 40 మంది పేద గిరిజనులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించి జైల్లో పెట్టారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను కూడా ఇంట్లో నుంచి లాక్కెళ్లి మరీ రిమాండ్‌ విధిస్తున్నారని సంజయ్ మండి పడ్డారు. ఐజీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, దీనిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమేనంటూ ఐజీని హెచ్చరించారు బండి సంజయ్‌.

కాగా, గుర్రంపోడు తండాలో జరిగిన బీజేపీ గిరిజన భరోసా యాత్ర లో భాగంగా బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన గోడవలలో కార్యకర్తల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి సహా 21 మంది నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు సహా బీజేపీ రాష్ట్రనేతలు, గిరిజనులపై నాన్ బెయిలబుల్ (NB) కేసులు నమోదయ్యాయి.