టీమ్ పిడికిలి ప్రాజెక్ట్ 2 గోడప్రతులు ఆవిష్కరించిన పాలకొండ జనసేన

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో పాలకొండ జనసేన ఆధ్వర్యంలో టీమ్ పిడికిలి ప్రాజెక్ట్ 2లో భాగంగా రూపొందించిన గోడ పత్రికలను విడుదల చేసి.. అనంతరం సీబీఐ దత్తపుత్రుడు కి జనసేన సవాల్, జనసేన లక్ష్యం అన్నం పెట్టే రైతన్న రాజు కావాలి అంటూ నినాదాలు ఇస్తూ ఆటోలకు, గోడలకు పోస్టర్ లను అతికించారు. పాలకొండ పట్టణంలో జనసైనికులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర గురించి ఆటోలో ఉన్న ప్రయాణికులకు అవగాహన కలిగించారు. అనంతరం నియోజకవర్గ నాయకులు పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, గొర్ల మన్మధ, కడగల హరికృష్ణ రానున్న రోజుల్లో పాలకొండ నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో జనసేన పార్టీ మరింత బలాన్ని చేకూర్చాలని జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు టీమ్ పిడికిలి ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కళ్యాణ్, గణేష్, లోకేష్, సాయి, పవన్, శ్రీకాంత్, రాంబాబు, దుర్గ, ప్రభు తదితరులు పాల్గొన్నారు.