నర్సంపేట నియోజకవర్గంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

  • ఘనంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి 51 వ జన్మదిన వేడుకలు
  • నియోజకవర్గ నాయకుడు “మేరుగు శివ కోటీ యాదవ్” అధ్వర్యంలో 200 మంది క్రియా శీలక సభ్యులతో బైక్ ర్యాలీ నిర్వాహణ విజయవంతం – కేక్ కటింగ్ మరియు స్వీట్ల పంపిణీ
  • పార్టీ ఉపాధ్యక్షుడు బొంగు నూరి మహేందర్ రెడ్డి మరియు రాష్ట్ర ఇన్చార్జ్ శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు జన సేన సభ్యత్వం తీసుకున్న క్రియా శీలక సభ్యులకి 5 లక్షల రూపాయలు జీవిత భీమా కిట్ల పంపిణీ కార్యక్రమం

వరంగల్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 51 వ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గం జనసేన అధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని రెడ్డి పంక్షన్ హాలులో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సమక్షంలో కేక్ కటింగ్ చేసి, నెక్కోఒ డ రోడ్డు నుంచి పాకల్ సెంటర్ వరకు 200 మంది జనసేన క్రియాశీలక కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే నియోజకవర్గఒలో జన సేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకి జన సేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన 5 లక్షల రూ.జీవిత బీమా కిట్లపంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నియోజకవర్గ మేరుగు.శివ కోటీ యాదవ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నర్సంపేట నియోజకవర్గఒ లో జన సేన పార్టీని మరింత బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాము అని, జన సేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తాము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు వంగా.మధు, ఒర్సు. రాజేందర్, సుధగాని ప్రదీప్, రాపోలు.సురేష్, గంగుల రంజిత్, ఎలబోయిన డేవిడ్ రాజ్, కొలువుల కార్తీక్, గాండ్ల అరున్ మరియు క్రియాశీలక సభ్యులు రాసమల్ల పవన్ కళ్యాణ్, అందే రంజిత్, కొమ్మ బిరాన్, షేక్ పాషా, మాదారపు కృష్ణ, గద్దల కిరణ్, జిలాని మరియు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

మేరుగు శివ కోటీ యాదవ్, జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గం మరియు వరంగల్ జిల్లా నాయకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *