సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న పోలిరెడ్డి వెంకటరత్నం

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పోలిరెడ్డి వెంకటరత్నం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు అత్యంత ప్రముఖ పండుగల్లో ఒకటైన సంక్రాంతి పండగను ప్రజలందరూ కన్నుల పండుగగా జరుపుకోవాలని ప్రజలందరూ పాడి పంటలతో, భోగాభాగ్యలతో సుఖ సంతోషాలతో ఉండాలని కుటుంబాలతో జరుపుకోవాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాని తెలిపారు. జనసేన అధ్యర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు మరింత అనందయాకంగా ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొయ్యల కనకదుర్గ, కొప్పిశెట్టి మంగరాజు, కస్తూరి సుబ్బారావు, కరీబండి ఈశ్వరరావు, ఉప్పులూరి వాసు, బండారు బాబీ, ఉల్లి రమేష్, కొప్పిశెట్టి సత్తిపండు, ఆదిమూలం మణికంఠ, కట్రేడ్డి మంగరాజు మరియు పెద్ద ఎత్తున గ్రామ మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.