పనికిరాని ఈ ప్రజాప్రతినిధులు మనకెందుకు?.. బొబ్బేపల్లి సురేష్

భోగి మంటల్లో వైసీపీ నేతల బొమ్మల్ని దగ్దం చేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో పాతబడి ఎందుకూ పనికిరాకుండా ఉన్న కట్టెలను తగులబెట్టి భోగి మంటలు వేస్తాం.. ఆ వెచ్చదనంలో కొత్తదనాన్ని ఆహ్వానిస్తాం.. అలాగే ప్రజల ఓట్లతో గెలిచి ఎందుకూ పనికిరాకుండా ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులను ఆ భోగి మంటల్లో వేసి తగలేస్తున్నాం.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం మాట్లాడుతుంటే వైసీపీ మంత్రులు.. తాడేపల్లి పాలేర్లు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ప్రజలు పని చేయండ్రా బాబు అని గెలిపిస్తే.. ఈ మంత్రులు కేవలం నోటితో మాత్రమే పని చేస్తున్నారు. ఇలాంటి మంత్రులు మనకెందుకు దండగ.. అందుకే భోగి మంటల్లో ఈ పాత సామానుని కూడా పడేస్తున్నాం. ఈ సంక్రాంతి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది కావాలని కోరుకుంటున్నాం. వైసీపీ మంత్రులకు చివరిగా ఒకటేచెబుతున్నాం. మీకు దమ్ముంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోండి.. చెత్తవాగుడు వాడుతూ అటూ ఇటూ కాని వేషాలు వేస్తే.. ప్రజలు మిమ్మల్ని ఈ భోగి మంటల్లో వేసి తగులబెట్టే రోజులు వస్తాయి.. ఖబడ్దార్.. అని సురేష్ అన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు మల్లికార్జున్, శ్రీహరి పాల్గొనారు.