క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగాహనా కార్యక్రమంలో గర్భాన సత్తిబాబు

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు, వీరఘట్టం మండలం “కంబర వలస పాలకొండ మండలం గుడివాడ” గ్రామాల్లో జనసైనికులకు ప్రజలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు యొక్క సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. అలాగే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని క్రియాశీలక సభ్యులకు సూచించారు. జనసేన వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని… వాళ్ళకి క్రియాశీలక సభ్యులు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విధంగా బలమైన మార్పుకు శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉందని జనసైనికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.