మాట నిలబెట్టుకున్నచిలకం మధుసూదన్ రెడ్డి.. ప్రమాద భాదితులకు ఆర్థిక సహాయం అందజేత

భాకరాపేట ఘాట్ లో యాక్సిడెంట్ కు గురై మృతి చెందిన ఎం.వెంగప్ప, ఎం.కాంతమ్మ, లక్ష్మీకాంతమ్మ వారి కుటుంబానికి 60వేల రూపాయలు.. అలాగే 41 మంది క్షతగాత్రులలో ఇద్దరైన గోపి చరణ్, మహేంద్రల కుటుంబాలను పరామర్శించి.. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వారి కుటుంబానికి మొత్తం ఒక్కొక్కరికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు. అలాగే జనసేన పార్టీ వారికి ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్లూరు దాసరి రామాంజనేయులు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, మండల కన్వీనర్స్ డి.నాగ సుధాకర్ రెడ్డి, పుర్రం శెట్టి రవి, జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు,నాయుడు నాయక్, కోటికి రామంజి, పేరూరు శ్రీనివాసులు, మోహన్, గొట్లురు చంద్రశేఖర్, దాడితోట కృష్ణయ్య, రాజ్ ప్రకాష్, ఇండ్ల రామాంజనేయులు, శివ శంకర్, నీలురి లక్ష్మి నారాయణ, నీలురి నాగార్జున, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.