స్వామీ!.. మీ అధికారాన్ని అభివృద్ధికి వినియోగించండి: డా యుగంధర్ పొన్న

  • అనవసరంగా అవరోధకంగా మారకండి.. ప్రజలు గమనిస్తున్నారు
  • జనసేన ప్రాబల్యాన్ని, ప్రభావాన్ని తట్టుకోలేక., ఓడి పోతామన్న భయం
  • అక్రమ కేసులు బనాయిస్తున్న ఉప ముఖ్యమంత్రి ఆగడాలను అరికట్టితీరుతాం
  • ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి
  • అదిరేది లేదు, బెదిరేది లేదు కానీ మీకు ఇదే చివరి డాన్స్
  • జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

కార్వేటినగరం మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడారు. ఈ సందర్భంగా యుగంధర్ పొన్న మాట్లాడుతూ.. స్వామీ! మీ అధికారాన్ని అభివృద్ధి కి వినియోగించండి గాని అనవసరంగా అవరోధకంగా మారకండి, ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. జనసేన ప్రాబల్యాన్ని, ప్రభావాన్ని తట్టుకోలేక, ఓడి పోతామన్న భయంతో, అక్రమ కేసులు బనాయిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆగడాలను అరికట్టితీరుతామని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, అదిరేది లేదు, బెదిరేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని మీకు ఇదే చివరి డాన్స్, ఎన్ని డాన్స్ లు వేస్తారో ఇప్పుడే వేసుకోండి, రానున్న ఎన్నికల్లో మీ గెలుపు అసాధ్యమని, ప్రజలే మిమ్మల్ని ఓడిస్తారని, మీ రాజకీయ జీవితం నల్లేరుపై నడకేనని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, వెదురుకుప్పం మండల గౌరవ అధ్యక్షులు నలిపి రెడ్డి మధు, ఉపాధ్యక్షులు వినోద్, కార్యదర్శి రూపేష్, జనసైనికులు పాల్గొన్నారు.