రాయలసీమ జోనల్ జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీ కో- కన్వీనర్ గా పండ్రా రంజిత్ కుమార్

కడప జిల్లా జనసేన పార్టీ మొదటి కార్యకర్త మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ ను జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ రాయలసీమ జోనల్ 1 కమిటీ కో-కన్వీనర్ గా నియమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని కార్యక్రమాలు సభలు నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రత్యేకంగా జోనల్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాయలసీమ 1 రాయలసీమ 2 జోన్లుగా ఈ కమిటీలు పనిచేస్తాయి ఈ కమిటీలలో రాయలసీమ జోనల్ 1 కమిటీ కన్వీనర్లను ఇంతకుముందే ప్రకటించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో 2014 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న పండ్రా రంజిత్ కుమార్ ను రాయలసీమ జోనల్ 1 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ కమిటీ కో- కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా పండ్రా రంజిత్ కుమార్ మాట్లాడుతూ నా పైన నమ్మకం ఉంచి నన్ను జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ రాయలసీమ జోనల్ కమిటీ కోకన్వీనర్ గా నియమించడం చాలా సంతోషంగా ఉందని నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాటిస్తూ రాయలసీమ జోనల్ పరిధిలోని నియోజకవర్గాలలో జనసేన పార్టీ కార్యక్రమాలు సభలు విజయవంతం అవ్వడానికి మరియు పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని జనసేన టిడిపి పొత్తులో భాగంగా ప్రకటించబోయే అభ్యర్థులు గెలుపుకు కృషి చేస్తానని, ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.