ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకూ రిజిస్ట్రేషన్లు
ఎల్ఆర్ఎస్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి తెలిపింది. కాగా కొత్తగా వేసిన లే అవుట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరిట ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగాయి.
కాగా, ఇంతకుముందే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా, ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.