సత్తెనపల్లి జనసేన కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు

సత్తెనపల్లి, పాదయాత్రను అడ్డుకున్నందుకే రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని, దీక్షలో జనసేన నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకటసాంబశివరావు తదితరులు పాల్గొనడం జరిగింది. గతంలో జరిగిన పవన్ కళ్యాణ్ సభ విజయవంతం అయితే నియోజకవర్గం అంతటా పాదయాత్ర చేస్తారని నాని మొక్కుకోవడం జరిగిందని, మొక్కులో భాగంగా పాదయాత్రకు అనుమతి అడిగామని పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి అడుగడుగునా పాదయాత్రను అడ్డుకోవడం హేయమైన చర్య అని ఆరుగురికి పర్మిషన్ ఇచ్చారని తెలిపారిఉ. ఇద్దరు, ముగ్గురుతో పాదయాత్ర చేస్తుంటే కూడా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని, గర్నెపూడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి చేజర్ల కపోతేశ్వర ఆలయం వరకు శాంతియుతంగా సాగే ఈ యాత్రకు అనుమతి ఇవ్వాలని సత్తెనపల్లి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, చిలకా పూర్ణ, ముప్పాళ్ల మండల ఉపాధ్యక్షులు గౌస్, కోటా తిలక్, నకరికల్లు మండల అధ్యక్షురాలు లక్ష్మీ శ్రీనివాస్, నకరికల్లు ఉపాధ్యక్షులు రఫీ, టీడీపీ నాయకులు యర్ర వెంకటేశ్వర్లు మరియు జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.