రహదారికి మోక్షం

రాజోలు మండలం చింతలపల్లి పాటి వారి గ్రూపులో రహదారికి మోక్షం కలిగింది. ఎన్నో ఏళ్ళుగా రహదారి లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీ రాజోలు వైస్ ఎంపిపి ఆనందరాజు చొరవతో మండల పరిషత్ నిధులు రూ. 3.15 లక్షలతో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. ఆనందరాజు నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది.