పెండింగ్ డిఏ లను రిలీజ్ చేయాలని శింగనమల జనసేన డిమాండ్

అనంతపురం, శింగనమల, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని… రాష్ట్ర ప్రభుత్వం ఆశుతోష్ మిశ్రా పే రివిజన్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేయకుండా చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ రిపోర్టు ఆధారంగా చేసిన పిఆర్సి ప్రకటనను ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏకతాటిపై వచ్చి తిరస్కరించడం తో జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అలాగే అయిదు పెండింగ్ డిఏ లను రిలీజ్ చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడే రకంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.