Sullurupeta: పాదయాత్ర చేస్తున్న శేఖర్ని కలిసి సంఘీభావం తెలిపిన సూళ్లూరుపేట జనసేన నాయకులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాబోయే ఎన్నికలలో శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గెలుపొందాలని కోరుతూ విజయవాడ నుండి చెన్నైకి పాదయాత్ర చేస్తున్న శేఖర్ని కలిసి సంఘీభావం తెలిపిన సూళ్లూరుపేట జనసేన నాయకులు కిరణ్ వంశీ తేజ. పాదయాత్ర చేస్తున్న శేఖర్ ప్రజారంజక పాలన అందిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా పరిపూర్ణ పాలన కావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడమే మార్గమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.